Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అబ్బే... ఆ డిక్లరేషన్ మినహాయింపు జగన్ కు మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి

అబ్బే... ఆ డిక్లరేషన్ మినహాయింపు జగన్ కు మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి
, ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (15:41 IST)
తిరుమలలో డిక్లరేషన్ మినహాయింపు ముఖ్యమంత్రి జగన్ కు మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు డిక్లరేషన్‌ సమర్పించాల్సిన అవసరం లేదన్న టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై మాజీ సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. డిక్లరేషన్‌ అక్కర్లేదనడం ఆధ్యాత్మిక ద్రోహమన్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చడం సరికాదని పేర్కొన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో సిఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన పాలనా కాలంలో ఎలాంటి డిక్లరేషన్‌ ఇవ్వలేదని, 5 సంవత్సరాలు స్వామి వారికి పట్టువస్త్రాలు ఇచ్చారని, ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్‌.జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.

అందరూ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని టిటిడి ఛైర్మన్‌ అనలేదని స్పష్టం చేశారు. ఆ విషయమై తనకు టిటిడి ఛైర్మన్‌ క్లారిటీ కూడా ఇచ్చారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ప్రకటనను వివాదం చేయొద్దని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్.. తొలి డోస్ వేయించుకున్న ఆరోగ్య మంత్రి