Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపులకు రిజర్వేషన్లు రావడం సాధ్యం కాదా.. ఎందుకు?

కాపు, బలిజ, ఒంటరి, తెలగ వారందరినీ బిసిల్లో చేర్చడమే కాకుండా ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎపి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కాపులు కృతజ్ఞతలు చెబుతున్నారు. కొన్ని చోట్ల ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు కూడ

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (13:28 IST)
కాపు, బలిజ, ఒంటరి, తెలగ వారందరినీ బిసిల్లో చేర్చడమే కాకుండా ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎపి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కాపులు కృతజ్ఞతలు చెబుతున్నారు. కొన్ని చోట్ల ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు కూడా చేశారు. అయితే కాపులకు రిజర్వేషన్లు రావడం చాలా కష్టమన్న విషయం చాలా మందికి తెలియదు. ఎపి ప్రభుత్వం తీర్మానించి పంపిన ఈ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీస్ సిగ్నల్ ఇవ్వడం ఏ విధంగానూ సాధ్యం కాదు.
 
ఎందుకంటే రాజ్యాంగ సవరణ జరగాలి. 9వ షెడ్యూల్ మార్చాలి. పార్లమెంటులో ఆమోదముద్ర లభించాలి. ఇదంతా సాధ్యమవ్వడం కల్లే. రాజ్యాంగాన్ని మార్చడం చాలా కష్టం. ఇప్పటికే బిసీల్లో 141కిపైగా కులాలు ఉంటే కొత్తగా మరో నాలుగింటిని ప్రభుత్వం అందులో చేర్చడం బిసిలకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇదొక రకమైన పోరాటం జరుగుతోంది. అంతే కాదు 20కిపైగా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఏర్పడితే కేంద్రం చేతులు కట్టుకుని గమ్మని జరుగుతున్నదాన్ని చూస్తూ కూర్చుంది. 
 
అలాంటిది ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక తీర్మానం చేసి పంపిన వాటిని కేంద్రం ఆమోదం ఇస్తుందనుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను సాధ్యం కాదని తెలుస్తోంది. కర్ర విరగకుండా, పాము చావకుండా చంద్రబాబు ఎంతో ముందు ఆలోచనతో కాపులకు రిజర్వేషన్లు ప్రకటించారు గాని, అది కాస్త కేంద్రంలో ఆమోదం లభించడమనేది ఎట్టి పరిస్థితుల్లోను సాధ్యం కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

తర్వాతి కథనం
Show comments