Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతు కోసుకున్న ఇంటర్ విద్యార్థి.. ఎందుకంటే...

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (12:04 IST)
నల్గొండ పట్టణానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల 13వ తేదీన చివరి పరీక్ష జరుగనుంది. అయితే, ఇప్పటివరకు జరిగిన పరీక్షలను సరిగా రాయక పోవడంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలన్న భయంతో ఆ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీకి సమీపంలో తరుణ్ కుమార్ అనే యువకుడు గొంతు కోసుకున్నాడు. అతన్ని ఎవరూ గుర్తించకపోవడంతో రాత్రంతా అక్కడే ఉన్నాడు. మంగళవారం ఉదయం కాలేజీ పరిసర ప్రాంతాలకు వాకింగ్‌కు వెళ్లిన కొంతమంది అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు.
 
వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అచేతనంగా పడివున్న తరుణ్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, బాధితుడు ఇంటర్ విద్యార్థిగా గుర్తించారు. ఆ తర్వాత నిందితుడు వద్ద విచారించగా అతను చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయారు. 
 
తన పేరు మాచర్ల తరుణ కుమార్ అని, తనకు తానే గొంతు కోసుకున్నానని చెప్పాడు. మొదట తనపై ఎవరో గుర్తు తెలియనివారు దాడి చేశారని తెలిపారు. తర్వాత అసలు విషాయాన్ని బైటపెట్టారు. సూర్యాపేట జిల్లా కాసర్లకు చెందిన తాను ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్టు చెప్పాడు. 
 
ప్రస్తుతం ఇంటర్‌కు పరీక్షలు జరుగుతున్న క్రమంలో అన్ని పరీక్షలు రాసిన తరుణ్ చివరి పరీక్ష రేపు అంటే మార్చి 13న రాయాల్సి ఉంది. ఈ క్రమంలో పరీక్షలు సరిగా రాయలేదనీ.. ఫెయిల్ అయిపోతాననే భయంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలీయక అయోమయానికి గురై ఈ పనికి పాల్పడినట్టు వెల్లడించాడు. తల్లిదండ్రులు తిడతారనే భయంతో  ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తరుణ్ పోలీసులకు తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments