Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుగురు కొడుకుల తల్లిదండ్రుల దుస్థితి

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (11:54 IST)
ఆడబిడ్డలంటేనే ఖర్చులు... అదే కొడుకులైతే ఏదో ఉద్దరించేస్తారని... కొడుకుల కోసం ఎదురుచూసే తల్లిదండ్రులందరికీ ఇది ఒక గుణపాఠంలాంటి సంఘటన...
 
వివరాలలోకి వెళ్తే... జయశంకర్ ‌- భూపాలపల్లి జిల్లా ఆజం నగర్‌కు చెందిన మంతు బసవయ్య (80) అనే వ్యక్తికి ఆరుగురు కొడుకులు. అయినప్పటికీ... ముదిమి వయసులో ఉన్న ఆ దంపతులను పట్టించుకొని, పట్టెడన్నం పెట్టేవాళ్లు కరువయ్యారు. అందులోనూ ఆసరా పింఛనులు పొందేందుకు కూడా అడ్డంకిగా ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ కుమారుడు అడ్డుతగిలాడు. 
 
మిగిలి ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం రాకపోవడంతో రైతుబంధు అందకపోవడం... వంటి సమస్యలతో తమను ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు మొరపెట్టుకునేందుకు ఆ ముసలి దంపతులిద్దరూ సోమవారం టీఆర్‌ఎస్‌ భవన్‌ ఎదుట రోజంతా పడిగాపులు కాసారు. అయితే... అపాయింట్‌మెంట్‌ లేని కారణం సెక్యూరిటీ గార్డులు అడ్డు చెప్పడంతో ఆ కాస్తా ఆశ కూడా నిరాశగా మారి వెనుదిరిగారు.
 
మరి కేసీఆర్ ఏం చేయనున్నారో... వేచి చూడాలి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments