Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజన్న కూడు పెడితే జగనన్న పొట్ట కొడుతున్నాడు: బీజేపీ చీఫ్

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (08:40 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ దివంగత సీఎం రాజన్న కూడు పెడితే ప్రస్తుత సీఎం జగనన్న పొట్ట కొడుతున్నారంటూ విమర్శించారు.  
 
లక్షలాది ఉద్యోగాలంటూ నానా హంగామా చేసిన వైసీపీ, గ్రామ వాలంటీర్ పోస్టులను కేవలం వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నారంటూ ఆరోపించారు. ఇసుక విధానంపై ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని ఆరోపించారు. 
 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. పోలవరం రీటెండరింగ్ విధానాన్ని తప్పుబట్టారు. టెండర్లు రద్దు చేసుకుంటూ పోతే నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండబోదన్నారు. అవినీతి నిర్మూలనపై జగన్ మాటలు తప్ప చేతలు లేవని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments