Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇదేనా రాజన్న రాజ్యం?: చంద్రబాబు

ఇదేనా రాజన్న రాజ్యం?: చంద్రబాబు
, శుక్రవారం, 9 ఆగస్టు 2019 (05:38 IST)
వైద్య విద్యార్థిపై డీసీపీ చేయిచేసుకోవడాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆందోళన చేపట్టినా వైసీపీ ప్రభుత్వం అసహనానికి గురవుతోందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

ఎన్ఎమ్‌సి బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్‌ను డీసీపీ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇదేనా రాజన్న రాజ్యం.. ప్రజల గొంతునొక్కే ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు అన్నారు.

వైద్య విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ టీడీపీ ఎంపీ కేసినేని నాని కూడా ట్వీట్ చేశారు. ‘‘సీఎంగారూ.. మీ పాలనలో సమస్యలపై శాంతియుతంగా ధర్నా చేస్తే.. పోలీసులతో కొట్టిస్తారా?" అంటూ ప్రశ్నించారు. "రాష్ట్రంలో రౌడీరాజ్యం, ఫ్యాక్షన్‌ రాజ్యం.. పోలీసు రాజ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించవద్దు’’ అని కేశినేని నాని ట్వీట్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టికల్ 370: పాకిస్తాన్ ఆగ్రహం భారత్‌ను ఏం చేయగలదు?