Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‍‌లో దారుణం.. ఆఫీసులోనే మహిళా తాహశీల్దారు సజీవదహనం

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (14:49 IST)
హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారణం జరిగింది. పట్టపగలు పది మంది చూస్తుండగానే ఆఫీసులో మహిళా తాహశీల్దారును సజీవదహనం చేశాడో దుర్మార్గుడు. ఆ తర్వాత తాను కూడా నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. 
 
సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దారు కార్యాలయంలో ఓ మహిళ తాహశీల్దారుగా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు ఆమెపై కిరోసిన్ పోసి, నిప్పటించి సజీవదహనం చేశాడు. 
 
ఆ తర్వాత తనపై కూడా కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ఆఫీసులో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. జరిగిన ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దుండగుడు ఇలాంటి కిరాతక చర్యకు ఎందుకు పాల్పడ్డాడో తెలియడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments