Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డను నీటి సంపులో పడేసి చంపేసిన తల్లి...

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (10:25 IST)
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అక్కసుతో ఓ కసాయి తల్లి కన్నబిడ్డను నీటి సంపులో పడేసి చంపేసింది. ఆ తర్వాత ఆ నేరాన్ని కట్టుకున్న భర్తపై మోపేందుకు ప్రయత్నించింది. కానీ, పోలీసుల విచారణలో అన్ని విషయాలు వెల్లడికావడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది.
 
హైదరాబాద్ నగరంలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ క్రైమ్ న్యూస్ వివరాలను పరిశీలిస్తే, మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మూక్రమ్ అనే వ్యక్తి ఉన్నారు. ఈయనకు వివాహమై ముగ్గురు ఆడపిల్లలతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. 
 
ఈ క్రమంలో మూక్రమ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో భర్తపై ఉన్న కోపంతో మూడు సంవత్సరాల కొడుకు రెహాన్‌ను నీటిసంపులో పడేసి చంపేసింది. 
 
ఈ నేరాన్ని తన భర్తే చేశాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. దీంతో మాక్రమ్ భార్యను అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments