Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పరీక్షలో అర్హత సాధించలేదనీ... 5 అంతస్తుల భవనంపై నుంచి...

నీట్ పరీక్షా ఫలితాలు మరో యువతి ప్రాణాలు తీశాయి. సోమవారం తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకుంది. వీరిద్దరూ ఇంటర్‌లో మంచి మెరిట్ స్టూడెంట్స్ కావడం గమనార్హం.

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (15:16 IST)
నీట్ పరీక్షా ఫలితాలు మరో యువతి ప్రాణాలు తీశాయి. సోమవారం తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకుంది. వీరిద్దరూ ఇంటర్‌లో మంచి మెరిట్ స్టూడెంట్స్ కావడం గమనార్హం. ఇంటర్‌లో 1150 పైచిలుకు మార్కులు సాధించినప్పటికీ.. నీట్ పరీక్షలో అర్హత సాధించలేక పోయారు. ఫలితంగా బలవన్మరణాలకు పాల్పడ్డారు.
 
హైదరాబాద్ నగరం అబిడ్స్‌లోని మయూరీ కాంప్లెక్స్‌ ఐదో అంతస్తు నుంచి ఓ యువతి దూకేసింది. తొలుత ఈ యువతి ఎవరన్నది గుర్తించలేక పోయారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 
 
అనంతరం ఆ అమ్మాయి ఎవరు? ఎందుకీ ఘటనకు పాల్పడిందన్న విషయాలను పోలీసులు సేకరించారు. మృతురాలు హైదరాబాద్‌లోని బర్కత్‌పురాకు చెందిన జస్లిన్‌ కౌర్‌ (18)గా గుర్తించారు. సోమవారం విడుదలైన నీట్‌ ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి అబిడ్స్‌కు వచ్చి ఈ ఘటనకు పాల్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments