Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి, చదువు, అధికారం వుంటే కళ్లు నెత్తికెక్కుతాయి.. కానీ జగన్‌కు...

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (19:16 IST)
సాధారణంగా ఆస్తితో పాటు చదువు, అధికారం ఉంటే చాలా మందికి కళ్లు నెత్తికెక్కుతాయని, అలాంటిది వైఎస్. జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రకమని శ్రీ చిన్నజీయర్ స్వామి అన్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ముచ్చింతల్ శ్రీరామ నగరులో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంప్రదాయ పంచెకట్టులో పాల్గొన్నారు. అలాగే, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌పై చిన్నజీయర్ స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. జగన్‌కు ఆస్తి ఉంది. చదువు వుంది. అధికారం ఉంది. సాధారణంగా ఇవన్నీ ఉన్నవారికి కళ్లు ఎక్కడిక ఎక్కుతాయో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, జగన్ మాత్రం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి అని అన్నారు. ఏమాత్రం అహం నెత్తికెక్కించుకోకుండా, తన ఆలోచనలతో ప్రజాపరిపాలనపై నిరంతరం దృష్టిసారిస్తున్నారని కితాబిచ్చారు. ఇది అభినందించదగిన విషయమన్నారు. 
 
ఈ సందర్భంగా జగన్‌ను ఉద్దేశించి చిన్నజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఓ యంగ్ బాయ్ అన్నారు. అవునా? కాదా? అని చమత్కారంగా అడగ్గా జగన్ మాత్రం ఎప్పటిలానే చిద్విలాసంగా చిరునవ్వులు నవ్వారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments