Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 2న పెళ్లైతే ఇపుడు మూడు నెలల గర్భం ఎలావస్తుంది.. అందుకే చంపేశా...

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (11:05 IST)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ దారుణం జరిగింది. మే నెల రెండో తేదీన వివాహం చేసుకున్న ఓ యువతి ఇపుడు మూడు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. దీన్ని జీర్ణించుకోలేని భర్త ఆమెన పాశవికంగా చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణానికి చెందిన మహబూబ్ అనే యువకుడు అదే ప్రాంతంలో బీరువాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఆదోని మండలానికి చెందిన రజియాబాను అనే యువతినిచ్చి గత మే నెల రెండో తేదీన వివాహం చేశారు. 
 
అయితే, ఇటీవల రజియాబాను అనారోగ్యానికి గురైంది. దీంతో భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. రజియాబాను మూడు నెలల గర్భవతి అని చెప్పారు. దీంతో భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. 
 
అప్పటి నుంచి నిత్యం వేధిస్తూ వచ్చిన మహబూబ్... సోమవారం రాత్రి నిద్రిస్తున్న భార్య గొంతు నులిపి హత్య చేశాడు. ఆపై తన ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, మహబూబ్‌ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రజియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం