Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 2న పెళ్లైతే ఇపుడు మూడు నెలల గర్భం ఎలావస్తుంది.. అందుకే చంపేశా...

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (11:05 IST)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ దారుణం జరిగింది. మే నెల రెండో తేదీన వివాహం చేసుకున్న ఓ యువతి ఇపుడు మూడు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. దీన్ని జీర్ణించుకోలేని భర్త ఆమెన పాశవికంగా చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణానికి చెందిన మహబూబ్ అనే యువకుడు అదే ప్రాంతంలో బీరువాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఆదోని మండలానికి చెందిన రజియాబాను అనే యువతినిచ్చి గత మే నెల రెండో తేదీన వివాహం చేశారు. 
 
అయితే, ఇటీవల రజియాబాను అనారోగ్యానికి గురైంది. దీంతో భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. రజియాబాను మూడు నెలల గర్భవతి అని చెప్పారు. దీంతో భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. 
 
అప్పటి నుంచి నిత్యం వేధిస్తూ వచ్చిన మహబూబ్... సోమవారం రాత్రి నిద్రిస్తున్న భార్య గొంతు నులిపి హత్య చేశాడు. ఆపై తన ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, మహబూబ్‌ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రజియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దసరాకు సీజన్‌లో విడుదలయ్యే తెలుగు చిత్రాలేంటి?

Samantha: చైతూ టాటూను తొలగించుకునే పనిలో పడిన సమంత రూత్ ప్రభు

Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ స్పీడ్ పెంచాడా? రెండు సినిమాలు చేస్తున్నాడా?

క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ తో ఓ అందాల రాక్షసి సిద్ధమైంది

Shah Rukh Khan: సుకుమార్ కు బాలీవుడ్ ఆపర్లు - షారుఖ్ ఖాన్ తో చర్చలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం