భార్య కూర సరిగా వండలేదని భర్త ఆత్మహత్య.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (15:03 IST)
భార్యాభర్తల గొడవలు సామాన్యమే. అయితే ఇక్కడో వ్యక్తి భార్యతో గొడవకు దిగాడు. కూర సరిగ్గా వండలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌, కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం పిండివారిపాలెంకు చెందిన చింతల తిరుమలరావుకు రెండేళ్ల క్రితం నిర్మల జ్యోతితో పెళ్లైంది. వీరికి ఎనిమిది నెలల పాప కూడా ఉంది.

ఇదిలా ఉంటే గురువారం ఉదయం కూర సరిగా వండలేదన్న నెపంతో భార్యతో గొడవపడ్డాడు. ఈ కాసేపు ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
 
ఆ తర్వాత పెడనలోని ఒకటవ వార్డులో ఉన్న అతడి స్నేహితుడు గోపీ ఇంటికి వెళ్లి పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న తిరుమలరావును స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే అతడ్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
చిన్నపాటి కారణానికే ఆత్మహత్య చేసుకోవడంపై తిరుమలరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఐతే ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం కూరవిషయమే కారణమా.. లేక మరేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

Chandini Chowdary,: తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి చిత్రం లాంచ్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments