పవన్ కళ్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత గోరంట్ల!

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (14:48 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరీ అంతగా ఊహించుకోవద్దని ఆయన హెచ్చరించారు. 
 
వచ్చే 2024లో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్లు ఇచ్చారు. అందులో ఒకటి జనసేన - బీజేపీ పొత్తు కొనసాగుతుందన్నారు. అయితే, తమతో చేతులు కలిపే విషయంపై టీడీపీ నేతలే ఆలోచన చేయాలంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
దీనిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. తన బలంపై పవన్ అతిగా ఊహించుకుంటున్నారన్నారు. సాధారణంగా కింటా కాటా తూగడానికి ఒక్కోసారి కొంత ధాన్యం అవసరం అవుతుంది. కానీ, ఆ ధాన్యం వల్లనే మొత్తం కాటా తూగుతుందని అనుకుంటే ఎలా? అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. ఇపుడు ఈ ట్వీట్‌పై ఏపీలో రాజకీయ రచ్చ సాగుతోంది. 
 
ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ దిశంగానే టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇపుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆ ప్రయత్నాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments