Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో గణనీయంగా తగ్గిన పాజటివ్ కేసులు

Webdunia
సోమవారం, 24 మే 2021 (18:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. నిన్నామొన్నటివరకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ, సోమవారం ఈ కేసుల సంఖ్య 12 వేలకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 58,835 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 12,994 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,93,821కి చేరింది. తాజాగా 96 మరణాలు న‌మోద‌య్యాయి. 
 
క‌రోనా వ‌ల్ల కొత్త‌గా చిత్తూరులో 14, క‌ర్నూల్‌లో 10, విజ‌య‌న‌గ‌రంలో 10, అనంత‌పూర్‌లో 9, తూర్పుగోదావరిలో 8, విశాఖ‌ప‌ట్నంలో 8, గుంటూరులో 7, కృష్ణలో 7, నెల్లూరులో 7, శ్రీకాకుళంలో 7, ప‌శ్చిమ గోదావ‌రిలో 4, ప్రకాశంలో 3, క‌డ‌ప‌లో 2 చొప్పున మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 
 
అలాగే, ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,222కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 18,373 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌ బులిటెన్‌లో వెల్ల‌డించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments