Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉచితంగా మందులను సరఫరా పంపిణీ చేసిన బయోఫోర్

ఉచితంగా మందులను సరఫరా పంపిణీ చేసిన బయోఫోర్
, ఆదివారం, 23 మే 2021 (16:50 IST)
కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విపత్కర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.25 లక్షల విలువైన మందులను ఉచితంగా అందించేందుకు హైదరాబాద్ నగరానికి చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ సీఈవో రంగిశెట్టి జగదీశ్ బాబు ముందుకొచ్చారు. ఈ మేరకు సంబంధిత మందులను హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయం సిబ్బంది రెండు వాహనాల్లో తీసుకువచ్చి గుంటూరులోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌లో అధికారులకు ఆదివారం అందజేశారు.
 
బయోఫోర్ సీఈవో రంగిశెట్టి జగదీశ్ బాబు అందజేసిన మందుల్లో డాక్సీసైక్లిన్ 100 ఎంజి టాబ్లెట్లు 50వేలు, ఐవర్‌మెక్టిన్ 12ఎంజి టాబ్లెట్లు 25వేలు, అజిత్రోమైసిన్ 500 ఎంజి టాబ్లెట్లు 25వేలు, వి టాబ్ 1లక్ష, జింకోవిట్ టాబ్లెట్లు 50వేలు, ఎకోస్ప్రిన్ 75ఎంజి టాబ్లెట్లు 50వేలు ఉన్నాయని జిల్లా అధికారులు తెలిపారు. 
 
ఈ మందులన్నీ కోవిడ్ బారినపడిన 5 వేల మంది పేషెంట్లకు అందించనున్నారు. కొవిడ్‌ బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తోందని.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం అందించడం అభినందనీయమని.. వారికి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలుపుతున్నామని స్టేట్ కొవిడ్ స్పెషలాఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 
 
కరోనా బాధితులకు అవసరమైన అన్ని వైద్యసదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ.. బాధితుల సంఖ్య పెరుగుతోందని.. ఈ పరిస్థుతుల్లో కోవిడ్ చికిత్సకు అవసరమయ్యే మెడికల్ ఎక్విప్మెంట్, మందులను అందించేందుకు సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు. బయోఫోర్ సీఈవో రంగిశెట్టి జగదీశ్ బాబు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని సాయం చేసేందుకు ముందుకు రావాలని డాక్టర్ అర్జా శ్రీకాంత్ పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైద్య ఖర్చులు చూసి కరోనా రోగులు భయపడి పోతున్నారు..