Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్‌తో యువతి ప్రేమ వివాహం.. గొంతుకోసి చంపేసిన తండ్రి...

తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. కనిపెంచిన కుమార్తె తమకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆ తండ్రి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కత్తి తీసుకుని కుమార్తె గొంతు కోసి చ

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (09:42 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. కనిపెంచిన కుమార్తె తమకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆ తండ్రి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కత్తి తీసుకుని కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అబ్దుల్లాపూర్ మెట్ ఎస్సీ కాలనీకి చెందిన విజయ అనే యువతి వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తిని నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ దంపతులు ఊరి నుంచి దూరంగా వెళ్లి జీవిస్తున్నారు. ఈ క్రమంలో తన అత్త చనిపోవడంతో విజయ సొంత ఊరికి వచ్చింది. 
 
ఈ విషయం తెలుసుకున్న విజయ కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చి ఆమెతో గొడవ పెట్టుకున్నారు. అయితే ఈ పెళ్లి వ్యవహారంతో ఊర్లో తన పరువు పోయిందని భావించిన తండ్రి విజయను కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. కుమార్తె నిండు గర్భిణి అని కూడా చూడకుండా చంపేశాడు. ఆ తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments