Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు: నీలం సాహ్ని

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (05:51 IST)
రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్లు మంజూరు చేసే దిశగా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులకు సూచించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో రాష్ట్రంలోని పట్టణ గృహ నిర్మాణాలపై స్టేట్ లెవల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీతో సీఎస్  నీలం సాహ్ని సమీక్షా సమీవేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి అధికారులు సిద్ధం చేసిన పీఎంఏవై గృహాలకు సంబంధించిన డీపీఆర్ కు సీఎస్ ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం 3,70,255 పీఎంఏవై (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన) గృహాల మంజూరుకు సంబంధించిన  డీపీఆర్ పై  సీఎస్ చర్చించిన అనంతరం ఆమోదం తెలిపారు. 

గృహాల మంజూరుకు  డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వం కు పంపించనున్నారు.  గృహాల మంజూరుకు సంబంధించి ఏర్పాటైన స్టేట్ లెవల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీలో సీఎస్ తో పాటు  పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ (ల్యాండ్  అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ, ఏపిటిడ్కో ఎండీ ఉన్నారు.

ఈ సమావేశంలో గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజైయ్ జైన్, పురపాలక పరిపాలన కార్యదర్శి శ్యామలారావు, ల్యాండ్ ఎండోమెంట్స్ కార్యదర్శి ఉషారాణి, ఏపీటిడ్కో ఎండీ మైదీన్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments