నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు: నీలం సాహ్ని

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (05:51 IST)
రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్లు మంజూరు చేసే దిశగా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులకు సూచించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో రాష్ట్రంలోని పట్టణ గృహ నిర్మాణాలపై స్టేట్ లెవల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీతో సీఎస్  నీలం సాహ్ని సమీక్షా సమీవేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి అధికారులు సిద్ధం చేసిన పీఎంఏవై గృహాలకు సంబంధించిన డీపీఆర్ కు సీఎస్ ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం 3,70,255 పీఎంఏవై (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన) గృహాల మంజూరుకు సంబంధించిన  డీపీఆర్ పై  సీఎస్ చర్చించిన అనంతరం ఆమోదం తెలిపారు. 

గృహాల మంజూరుకు  డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వం కు పంపించనున్నారు.  గృహాల మంజూరుకు సంబంధించి ఏర్పాటైన స్టేట్ లెవల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీలో సీఎస్ తో పాటు  పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ (ల్యాండ్  అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ, ఏపిటిడ్కో ఎండీ ఉన్నారు.

ఈ సమావేశంలో గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజైయ్ జైన్, పురపాలక పరిపాలన కార్యదర్శి శ్యామలారావు, ల్యాండ్ ఎండోమెంట్స్ కార్యదర్శి ఉషారాణి, ఏపీటిడ్కో ఎండీ మైదీన్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments