Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కొండంత వర్షం : నీట మునిగిన తిరుపతి పట్టణం

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (07:16 IST)
తిరుపతి పట్టణం నీట మునిగింది. తిరుమలగిరుల్లో కొండత వర్షం కుంభవృష్టి కురిసింది. దీంతో తిరుపతి పట్టణం నీట మునిగింది. ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి. రోడ్లపై ప్రవహిస్తున్న వరదకు కార్లు, బైకులు నీటిలో మునిగిపోయాయి. 
 
ఈ వరద ప్రవాహంపై తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు స్పందించారు. తిరుపతిలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందనీ ఏ ఒక్కరూ బయటకు రావొద్దంటూ కోరారు. ముఖ్యంగా తిరుపతి నుంచి నెల్లూరుల, చెన్నై వేళ్ళేవారు పుత్తూరు, నాగలాపురం, సత్యవేడు, తడ మీదుగా వెళ్లాలని సూచించారు. 
 
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి పట్టణ పురపాలక సంస్థ కార్యాలయంలో 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజల సహాయం కోసం 0877 2256766 అనే ఫోన్ నంబరురో సంప్రదించాలని కోరారు. 
 
అటు తిరుమల ఘాట్ రోడ్డుపై 13 చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో రెండు ఘాట్ రోడ్లను మూసివేశారు. అలిపిరి కాలినడక మార్గాన్ని కూడా మూసివేశారు. దీంతో తిరుమల, తిరుపతి ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments