Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కొండంత వర్షం : నీట మునిగిన తిరుపతి పట్టణం

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (07:16 IST)
తిరుపతి పట్టణం నీట మునిగింది. తిరుమలగిరుల్లో కొండత వర్షం కుంభవృష్టి కురిసింది. దీంతో తిరుపతి పట్టణం నీట మునిగింది. ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి. రోడ్లపై ప్రవహిస్తున్న వరదకు కార్లు, బైకులు నీటిలో మునిగిపోయాయి. 
 
ఈ వరద ప్రవాహంపై తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు స్పందించారు. తిరుపతిలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందనీ ఏ ఒక్కరూ బయటకు రావొద్దంటూ కోరారు. ముఖ్యంగా తిరుపతి నుంచి నెల్లూరుల, చెన్నై వేళ్ళేవారు పుత్తూరు, నాగలాపురం, సత్యవేడు, తడ మీదుగా వెళ్లాలని సూచించారు. 
 
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి పట్టణ పురపాలక సంస్థ కార్యాలయంలో 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజల సహాయం కోసం 0877 2256766 అనే ఫోన్ నంబరురో సంప్రదించాలని కోరారు. 
 
అటు తిరుమల ఘాట్ రోడ్డుపై 13 చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో రెండు ఘాట్ రోడ్లను మూసివేశారు. అలిపిరి కాలినడక మార్గాన్ని కూడా మూసివేశారు. దీంతో తిరుమల, తిరుపతి ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments