Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి రాజ‌కీయ క‌క్ష‌లు కాదు... పొలం త‌గాదాలు: గుంటూరు రూరల్ ఎస్పీ

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (18:38 IST)
పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద జరిగిన సంఘటనపై గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పందించారు. అది పొలం త‌గాదాకు సంబంధించినద‌ని, రాజ‌కీయ క‌క్ష‌లు కాద‌ని తెలిపారు.


కొన్ని సామాజిక మాధ్యమాలలో తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద జరిగిన వీడియోలను చూశామ‌ని, ఆ ఘటన శివారెడ్డి, సైదాభి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న పొలం తగాదాలు కారణంగా చోటు చేసుకుంద‌ని ఎస్పీ తెలిపారు. ఈ ఘటన ఆదివారం జరిగిందని, సదరు సమాచారం అందిన వెంటనే పిడుగురాళ్ల పోలీస్ ఎఫ్. ఐ.ఆర్. 651/2021 కింద బాధితులు తెలిపిన సమాచారం మేరకు కేసు ద‌ర్యాప్తు చేపట్టార‌ని చెప్పారు.
 
 
గతంలో సైదాభి ఈ పొలం వివాదంలోనే శివారెడ్డిపై దాడి చేయగా, శివారెడ్డి ఫిర్యాదు మేరకు అక్టోబ‌రు 20న ఎఫ్.ఐ.ఆర్. 602/2021 కింద పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేశార‌ని చెప్పారు. పొలం వివాదంలో ఉన్న పాత కక్షలను దృష్ట్యా ఈ ఘటన జరిగినది తప్ప, దీనిలో ఎటువంటి రాజకీయ కోణం లేదని అన్నారు. ఏదేమైనప్పటికి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంద‌న్నారు. ఈ కేసుల్లో స‌త్వ‌రం స్పందించిన జిల్లా పోలీసుల‌కు   ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments