Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం తల్లీకుమార్తెను హత్య చేసిన బంధువు

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (14:00 IST)
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం జరిగింది. ఆస్తి వివాదంలో తల్లీకుమార్తెను సమీప బంధువు హత్య చేశాడు. ఇంట్లో ఉన్న తల్లీ కుమార్తెను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. 
 
శనివారం జరిగిన ఈ దారుణ హత్య కేసుల వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా నాగార్జున నగర్‌లోని ఇంట్లో పద్మావతి, ప్రత్యూష  అనే ఇద్దరు తల్లీకుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో సమీప బంధువు శ్రీనివాస్‌ రావు ఇంట్లోకి వచ్చి ఇద్దరిపై విచాక్షణారహితంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. 
 
రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ.. కత్తిపోట్ల బాధను పంటిబిగువన భరిస్తూ యువతి తన సోదరుడికి ఫోన్‌ చేసి అప్రమత్తం చేసింది. అవే ఆమె చివరి మాటలయ్యాయి. ఇరుగు పొరుగు వాళ్లు అక్కడికెళ్లి చూసేసరికి.. తల్లీకూతుళ్లు చనిపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అందిర్నీ షాక్‌కు గురిచేసింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఆస్తి వివాదమే ఈ జంట హత్యలకు కారణంగా ఉందని పోలీసులు వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments