ఫేస్‌బుక్ పరిచయం : పెళ్లి పేరుతో రూ.కోటి మోసం

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (13:40 IST)
ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్ జరిగే పరిచయాలు చివరకు విషాదాంతంగా ముగుస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ టెక్కీ నుంచి ఓ మహిళ ఏకంగా రూ.కోటి మేరకు దోచుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యర్రగడ్డ దాసు, జ్యోతి అనే దంపతులు కళ్యాణి శ్రీ పేరుతో ఓ ఫేస్‌బుక్ ఖాతాను ప్రారంభించి, అందుబాటులోకి వచ్చిన వారితో చాటింగ్ చేయసాగారు. అలా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు వీరికి పరిచయమయ్యారు. 
 
అతనితో జ్యోతి యేడాదిన్నరపాటు ప్రేమాయణం కొనసాగించింది. పెళ్లి చేసుకుంటానని దాసును జ్యోతి నమ్మించింది. చేతి ఖర్చుల కోసం దశల వారీగా రూ.కోటి వరకు తీసుకుంది. ఆ తర్వాత ఫేస్‌బుక్ ఖాతా డీయాక్టివేట్ అయింది. 
 
దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న టెక్కీ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేస్‌బుక్ ఖాతా ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వారిగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments