Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లేశ్వర స్వామి ఆలయ క్యాంటీన్‌లో చికెన్ వంటకాల తయారీ

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (13:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా పార్టీ నేతలు అంతా నా ఇష్టం అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఆలయాలను కూడా అపవిత్రం చేస్తున్నారు. ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అనేక హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి, పలు ఆలయాల రథాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. తాజాగా మరో అపచారం జరిగింది. 
 
గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వర స్వామి ఆలయ ఆవరణలో క్యాంటీన్ నిర్వాహకులు మాంసాహారం వండడంతో భక్తులు, ఆలయ అధికారుల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటనను ఓ భక్తుడు తన మొబైల్ కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
క్యాంటీన్‌లో భక్తులకు టిఫిన్, టీ, అన్నదాన ప్రసాదాలు అందజేసేవారని, అయితే క్యాంటీన్‌లో మాంసాహార వంటకాలు వండారని, ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని సమాచారం. స్థానిక వైకాపా నేత నుంచి వంటకాల తయారీకి భారీ ఆర్డర్ రావడంతో ఆలయ క్యాంటీన్ యజమాని ఏకంగా ఆలయ క్యాంటీన్‌లోనే ఈ మాంసాహార వంటకాలు తయారు చేసి సరఫరా చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments