Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకయ్య చొరవ : గూడూరు - విజయవాడ మధ్య ఇంటర్ సిటీ రైలు

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (11:23 IST)
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోమారు చొరవ తీసుకున్నారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రైలు పరుగులు తీయనుంది. గూడూరు - విజయవాడల మధ్య ఇంటర్ సిటీ రైలును నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ సమ్మతించింది. ఫలితంగా గూడూరు నుంచి విజయవాడకు కేవలం నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. ఈ రేలు నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, తెనాలి మధ్య ఆగనుంది. 
 
ప్రస్తుతం ఈ ప్రాంతాల మధ్య పలు రైళ్లు నడుసున్నాయి. అయితే, ఇవన్నీ సమయానుకూలంగా లేవన్న విమర్శలు వినొస్తున్నాయి. ఈ విషయాన్ని పలువురు రాజకీయ నేతలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రైల్వే శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి మేరకు విజయవాడ - గూడూరు మధ్య సరికొత్త ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించారు. ఈ రైలు కేవలం 4.30 గంటల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేరుకోనుంది. 
 
ఈ రైలు గూడూరు నుంచి ప్రతి రోజూ ఉదయం 6.10 గంటలకు బయలుదేరి నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి మీదుగా ఉదయం 10.40కి విజయవాడకు చేరుతుంది. ఇదే రైలు విజయవాడ నుంచి (12744) సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10.30 గంటలకు గూడూరుకు చేరుతుంది. ఈ రైలు రేక్‌ని నిర్వహించే బాధ్యత విజయవాడ డివిజన్‌కు అప్పగించారు. ఈ రైలును ప్రారంభించేందుకు స్వయంగా వెంకయ్యనాయుడు వస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments