Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రైతులకు మరో శుభవార్త... పసుపు-కుంకుమ మూడో చెక్కు కూడా...

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (18:15 IST)
ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. నాలుగో విడత రుణమాఫీ నిధులను విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఈ విడత రుణమాఫీ కోసం రూ.3,900 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఆయన మీడియాకు చెప్పారు. దీనితో 30 లక్షలకు పైగా రైతులకు వారి ఖాతాల్లో 39 వేల రూపాయల చొప్పున జమ చేసినట్లు చెప్పారు.
 
రైతులు రుణ అర్హత పత్రంతో బ్యాంకుకు వెళ్లాలని సూచించారు. ఏడాదికి 10 శాతం వడ్డీతో సహా రైతు రుణమాఫీ పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించారు. అన్నదాతా సుఖీభవ నిధులు కూడా ఖరీఫ్‌లోగా ఇస్తామన్నారు. మే 23 లోపు ఐదో విడత రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబరావు అన్నారు. మరోవైపు పసుపు కుంకుమ 3వ చెక్కు సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని కూడా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments