Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెక్క సరిపోయింది బాబూ.. ఆ 23కి ఈ 23తో సరిపెట్టిన జగన్

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (12:36 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాల్లో విజయఢంకా మోగించి తెలుగుదేశం, జనసేన పార్టీలకు చుక్కలు చూపించింది. 25 లోక్‌సభ స్థానాలకు 22 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఊహించని విజయాన్ని అందుకున్నారు. 
 
కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ  క్లీన్‌స్వీప్‌ చేసిందంటే జగన్ సునామీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సునామీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదిలావుంటే, వైసీపీ పార్టీ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయింలు ద్వారా తెలుగు దేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అందరూ అదే వైసీపీ చేతులో ఓటమిపాలవడం విశేషం. 
 
వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా గాలం వేసింది. అయతే వీరంతా తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో దారుణ పరాజయాలు పాలవడం ఒకఎత్తయితే.. తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుచుకుంది. 
 
దీనిపై స్పందిచిన వైసీపీ నాయకులు మా లెక్క సరిపోయిందని మాదగ్గర నుంచి అన్యాయంగా చంద్రబాబు 23 మందిని తీసుకెళ్లాడని అదే 23 మంది ఇప్పుడు చంద్రబాబుకు మిగిలారని అంటున్నాయి వైసీపీ వర్గాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments