Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో బయటపడిన బంగారు నాణాలు

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (07:03 IST)
శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానం ఘంటామఠం పునర్‌ నిర్మాణ పనుల్లో మరోసారి నాణేలు బయటపడ్డాయి. ఆదివారం నిర్మాణ పనులు చేస్తుండగా ఒక పెట్టెలో 15 బంగారు నాణేలు, 1 బంగారు ఉంగరం, 17 వెండి నాణేలు వెలుగుచూశాయి.
 
సమాచారం అందుకున్న ఆలయ ఈవో కె.ఎస్‌. రామారావు, తహసీల్దార్‌ రాజేంద్రసింగ్‌, సీఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకున్నారు. అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.

ఘంటామఠం దక్షిణ భాగంలో ఉన్న గుండంలో ఊట వచ్చే ప్రదేశంలో ఇవి బయట పడ్డాయి. బంగారు నాణేలు 1880-1911 కాలానికి సంబంధిచినవని, వెండి నాణేలు 1885-1913 కాలానికి చెందినవని ఆలయ అధికారులు గుర్తించారు.

వీటితోపాటు 1892 నాటి మరో వెండి నాణెం కూడా లభించింది. విషయం తెలుసుకున్న దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావు అధికారులతో కలిసి ఘంటామఠానికి చేరుకుని పురాతన నాణేలను పరిశీలించారు. అధికారుల సమక్షంలో వీటి వివరాలు నమోదు చేశారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments