Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరికి వరద ప్రవాహం: 50 అడుగులకు చేరిన నీటి మట్టం

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (11:06 IST)
గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం మంగళవారం ఉదయం 7 గంటలకు50 అడుగులకు చేరింది. ఈ ఏడాది గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరడం ఇది నాలుగోసారి.
 
జులై 16న గరిష్ఠంగా 71.3 అడుగులు, ఆగస్టు 12న 52.5, 17న 54.5 అడుగులు మార్కును గోదావరి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 51.60 అడుగులతో 13లక్షల 49 వేల 565 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పంటలు నీట మునిగాయి. భద్రాచలం-పేరూరు మధ్య తూరుబాక, పర్ణశాల, ఆలుబాక, గంగోలు రోడ్లపై నీరు చేరింది. 
 
బూర్గంపాడు మండలం సారపాక, అశ్వాపురం మండలం రామచంద్రాపురం, నెల్లిపాక బంజర వద్ద కూడా రోడ్లు మునిగాయి. భద్రాచలం నుంచి చత్తీస్​గఢ్, ఒడిశా, ఆంధ్రా రాష్ట్రాలకు రాకపోకలు బంద్ ​అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments