Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్మల్ని కూడా చంపేస్తారు.. ప్రాణాలు కాపాడండి.. : వివేకా కుమార్తె లేఖ

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:14 IST)
తమను కూడా చంపేస్తారన్న భయం వెంటాడుతుందని, అందువల్ల తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కోరారు. ఈ మేరకు ఈమె కడప ఎంపీ అన్బురాజ్‌కు ఓ లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని లేఖలో కోరారు. 
 
ఈనెల 10న పులివెందులలోని తమ నివాసం వద్ద మణికంఠ రెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని తన లేఖలో గుర్తుచేశారు. మణికంఠ రెడ్డి వైకాపా నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి అనుచరుడిగా ఆమె వివరించారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌ రెడ్డి ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని, ఇప్పుడు అతని అనుచరుడు రెక్కీ నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె లేఖలో పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ, డీజీపీ, సీబీఐ అధికారులకు సునీత లేఖలు పంపారు. లేఖతో పాటు సీసీ కెమెరా దృశ్యాల పెన్‌డ్రైవ్‌లు కూడా పంపినట్లు లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments