Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ రద్దు...కరోనా ఎఫెక్ట్

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:06 IST)
ప్రస్తుత కరోనా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని రాజ్ భ‌వ‌న్లో ఎట్ హోమ్ ర‌ద్దు అయింది. స్వాతంత్ర‌ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించకూడదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నిర్ణయించారని గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో గౌరవ గవర్నర్ 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, అవార్డు విజేతలు, మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా పాల్గొనేవారు. కరోనా తీవ్ర‌త నేపధ్యంలో ప్రస్తుత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సామూహిక కార్యక్రమాన్ని నిర్వహించరాదని గవర్నర్ ఆదేశించినట్లు ముఖేష్ కుమార్ మీనా వివరించారు.

ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ముసుగు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం వంటి కరోనా ప్రవర్తనా నియమావళిని పాటించటం ద్వారా కోవిడ్ నుండి రక్షణ పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, అర్హులైన వారందరూ ప్రాధాన్యత ఆధారంగా టీకాలు వేయించుకోవాలని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా తగిన ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments