Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కాంగ్రెస్‌కు మ‌రోసారి అవకాశం కల్పించండి: తెలంగాణ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (11:07 IST)
ఏపీ ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌కి జగ్గారెడ్డి వచ్చారు.

మూడు ప్రాంతాలను దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమానంగా అభివృద్ధి చేశారని తెలిపారు. రాష్ట్రం కలిసి ఉండాలని మొదటి నుంచి కోరుకున్నానని చెప్పారు.

ఏపీలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి టీడీపీ.. రెండవ సారి వైసీపీ అధికారంలోకి వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీనే కారణమని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

పోలవరానికి జాతీయ హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా బాగుంద‌ని కితాబిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments