Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కాంగ్రెస్‌కు మ‌రోసారి అవకాశం కల్పించండి: తెలంగాణ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (11:07 IST)
ఏపీ ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌కి జగ్గారెడ్డి వచ్చారు.

మూడు ప్రాంతాలను దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమానంగా అభివృద్ధి చేశారని తెలిపారు. రాష్ట్రం కలిసి ఉండాలని మొదటి నుంచి కోరుకున్నానని చెప్పారు.

ఏపీలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి టీడీపీ.. రెండవ సారి వైసీపీ అధికారంలోకి వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీనే కారణమని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

పోలవరానికి జాతీయ హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా బాగుంద‌ని కితాబిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments