Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈతకొలనులో జలకాలాడుతున్న గంటా.. మనవడితో నీలిరంగు ఆటలు

Webdunia
శనివారం, 4 మే 2019 (10:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి తగ్గింది. ఓటరు ఇచ్చిన తీర్పు ఈవీఎం యంత్రాల్లో నిక్షిప్తమైంది. ఈనెల 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, మండుటెండలో హోరాహోరీగా ప్రచారం చేసిన నేతలు ఇపుడు విహారయాత్రలకు వెళుతున్నారు. కొందరు ఇప్పటికే వెళ్లి సేదతీరుతుంటే.. మరికొందరు ఇపుడు బయలుదేరుతున్నారు. ఇలా ఎన్నికల ప్రచారం ముగియగానే తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి గంటా శ్రీనివాసరావు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఆయన ఓ విలాసవంతమైన హోటల్‌లో బస చేస్తున్నారు. 
 
హోటల్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతూ, తన మనవడితో ఆడుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపాక నా కుటుంబంతో కలిసి విహారయాత్రకు వచ్చాను. మనవడితో కలిసి నీలిరంగు నీటిలో ఆడుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ టూర్ కోసం ఎక్కడికి వెళ్లారన్న విషయమై గంటా స్పష్టత ఇవ్వలేదు. కానీ అది ఓ సముద్రతీర విహార కేంద్రమని ఫోటోలద్వారా తెలుస్తోంది.
 
కాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. అలాగే, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా తన కుటుంబ సభ్యులతో స్విస్ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఈయన మళ్లీ శనివారం లండన్ పర్యటనకు వెళ్లాల్సివుండగా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments