Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో మంట‌లు చెల‌రేగి న‌లుగురు స‌జీవ‌ద‌హ‌నం... తిరుమలకు వెళ్లి వస్తూ...

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (17:56 IST)
కారులో మంటలు చెలరేగి న‌లుగురు సజీవ దహనం, మరొకరి పరిస్థితి విషయంగా మారిన హృద‌య విదార‌క ఘ‌ట‌న చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గ పరిధిలో గంగవరం మండల సమీపంలోని మామడుగు వద్ద శ‌నివారం జ‌రిగింది.

కారులో మంటలు చెలరేగ‌డంతో అందులో ఉన్న న‌లుగురు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. కారులో ముగ్గురు పెద్దవారు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. జాహ్నవి, భానుతేజ, పావన రామ్, సాయి ఆశ్రీత, విష్ణు కారులో ప్రయాణిస్తున్నారు.

వీరిలో ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయట పడ్డారు. వీరు తిరుమల నుంచి కర్ణాటక బెంగళూరుకు వెళ్తున్నట్టు సమాచారం. టిటిడిలో జూనియర్ అసిస్టెంట్  విష్ణు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

కారులో విష్ణుతో పాటూ ఆయ‌న భార్య, కూతురు, కొడుకు, చెల్లెలు, చెల్లెలు కూతురు ఉన్నారు. విష్ణు గాయాలతో బయటపడగా మిగిలిన వారు సజీవ దహనమయ్యారు. ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతానికి వ‌చ్చిన స్థానికులు కంట‌త‌డి పెట్టారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments