Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ఒకేసారి కోర్టుకు ఐదుగురు నిందితులు

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (13:04 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు నిందితులను సీబీఐ ఒకేసారి కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఇది చర్చనీయాంశంగా మారింది. వివేకా హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసిన విషయం తెల్సిందే. ఈ విచారణలో భాగంగా, ఐదుగురు నిందితులను హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసు విచారణ ఏపీ నుంచి హైదరాబాద్ నగరానికి బదిలీ అయిన తర్వాత ఐదుగురు నిందితులను ఒకేసారి పిలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
ఇందుకోసం కడప కేంద్ర కారాగారంలో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్ వారెంట్ జారీకాగా, బెయిలుపై ఉన్న మరో ఇద్దరికీ సీబీఐ నుంచి సమన్లు అందాయి. కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ఉండగా, బెయిలుపై ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఉన్నారు. వీరు కడప నుంచి ఈ నెల 9వ తేదీన బయలుదేరి పదో తేదీ ఉదయం 10.30 గంటలకు హాజరుకానున్నారు. కడప నుంచి గట్టి భద్రత మధ్య హైదరాబాద్ నగరానికి తరలించాలని సీబీఐ అధికారులు ఏఆర్ పోలీసులను కోరారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments