నకిలీ మద్యం కేసు : ములకల చెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు

ఠాగూర్
మంగళవారం, 7 అక్టోబరు 2025 (17:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీని ఎక్సైజ్ శాఖ అధికారులు బహిర్గతం చేశారు. భారీ స్థాయిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నప్పటికీ పసిగట్టలేదని పేర్కొంటూ ములకల చెరువు ఎక్సైజ్‌ సీఐ హిమబిందుపై బదిలీవేటు పడింది. విజయవాడ ఎక్సైజ్‌ కమిషనర్‌ ఆఫీస్‌కు అటాచ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ములకల చెరువు ఇన్‌చార్జ్ బాధ్యతలను లక్కిరెడ్డి పల్లె ఎక్సైజ్‌ సీఐ కిశోర్‌ కుమార్‌కు అప్పగించారు. 
 
ములకలచెరువు - మదనపల్లె పాత రోడ్డులోని కనుగొండ ఆర్చి సమీపంలో ఉన్న ఓ పాత డాబాను అవాసంగా మార్చుకుని విజయవాడకు చెందిన జనార్దన్‌ రావు, ఆయన అనుచరుడు రాజు తమిళనాడు, ఒడిశా, విశాఖపట్నంలకు చెందిన పలువురితో తయారు చేయించి బెల్ట్‌షాపులకు సరఫరా చేశారు. ఈ విషయం ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో దాడులు నిర్వహించాలని కడప ఎక్సైజ్‌ అసిస్టెంట్ కమిషనర్‌ వేంపల్లి చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు.
 
దీంతో ఆయన రాయచోట¨ ఈఎస్‌ మధుసూదన్, సిబ్బందితో దాడులు చేసి రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యంతో పాటు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరో 15 వేల ఖాళీ సీసాలు, 1,050 లీటర్ల స్పిరిట్, సరఫరాకు ఉంచిన 1,500 లీటర్ల నకిలీ మద్యం బాటిళ్లు, ఇతర సామగ్రి, మద్యాన్ని సరఫరా చేసే వాహనాన్ని సీజ్‌ చేసి పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments