Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులా? తగ్లక్ పాలనలా వుంది : నాదెండ్ల

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (13:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనపై మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన సీనియర్ నేత నాదెండ్ల భాస్కర్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలన తుగ్లక్ పాలనలా ఉందంటూ ఎద్దేవా చేశారు. కేవలం మూడు వేల మంది జనాభాకు 30 మంది ఉద్యోగులా అంటూ ప్రశ్నించారు. 
 
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ అవసరమా? అని ప్రశ్నించారు. ప్రతి 3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులు ఎందుకని నిలదీశారు. జగన్ పాలనలో అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 
 
ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు చీదరించుకునేలా ఉండకూడదని సూచించారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. అనేక నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. పైగా, జగన్ పాలనలో ఇసుక దొరకడం గగనమైపోయిందన్నారు. కాగా, నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments