Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం

నేడు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం
, శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (12:20 IST)
పోలవరం ప్రధాన డ్యాం నుంచి ఎడమ కాలువ అనుసంధాన పనులకు ఆరు గుత్తేదారు సంస్థలు పోటీపడుతున్నాయి. ఆ సంస్థల నుంచి టెండరు బిడ్లు దాఖలయ్యాయి. రూ. 274.55 కోట్ల ఐబీఎం విలువతో జలవనరుల శాఖ టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈఎండీకి సంబంధించిన బ్యాంకు గ్యారంటీలు, డీడీల వివరాలను సరిచూసుకుని ఈ సంస్థలు రివర్స్ టెండర్లలో పాల్గొనవచ్చని జలవనరులశాఖ నిర్ణయానికి వచ్చింది. 
 
పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్, మ్యాక్స్ ఇన్​ఫ్రా లిమిటెడ్, ఆప్కాన్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆర్​ఆర్​సీఐఐపీఎల్, డబ్యూసీపీఎల్ సంయుక్త భాగస్వామ్యం, మేఘ ఇంజినీరింగా లిమిటెడ్, ఎంఆర్​కేఆర్ ఎస్​ఎల్​ఆర్ సంయుక్త భాగస్వామ్యంతో మెుత్తం 6 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత రివర్స్ టెండర్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీఏసీ ఛైర్మన్‌గా తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌