Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాకు ఏనుగుల బెడద

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:15 IST)
చిత్తూరు జిల్లాకు ఏనుగుల బెడద పట్టుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తున్న ఏనుగులు.. మనంషులపై దాడి చేస్తున్నాయి. పుత్తూరు, వడమాలపేట మండలాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గజరాజులు మంగళవారం నారాయణవనం మండలంలో ప్రవేశించాయి.

ఈ నేపథ్యంలో వీటి దాడులకు ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేకువజామున నారాయణవనం మండలం బొప్పరాజుపాళెం ఎస్టీ కాలనీ ప్రాంతంవైపు ఏనుగుల గుంపు వచ్చింది. అదే సమయంలో బహిర్భూమికి వెళ్లిన స్థానికులు సుబ్బరాయులు, సుబ్రహ్మణ్యంపై ఓ ఏనుగు తొండంతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.

108 సిబ్బంది బాధితులను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు రుయాస్పత్రికి రెఫర్‌ చేశారు.

నెలరోజులుగా పుత్తూరు, వడమాలపేట పరిసరప్రాంతాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో గజరాజుల దాడులు పెరగడంతో, అటవీశాఖ అధికారులు సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments