ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విరాళాల వెల్లువ‌

Webdunia
మంగళవారం, 19 మే 2020 (06:13 IST)
కరోనా మహమ్మారి నివారణకు, లాక్‌డౌన్ వేళ పేదలను ఆదుకునేందుకు గానూ సీఎంఆర్ఎఫ్‌కు సోమ‌వారం భారీగా విరాళాలు అందాయి. కరోనా నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ట్రైమెక్స్ గ్రూప్ కంపెనీ రూ.2 కోట్లు విరాళం ప్రకటించింది.

దీనికి సంబంధించిన చెక్కును సీఎం జగన్‌కు ట్రైమెక్స్ గ్రూప్ డైరెక్టర్ ప్రదీప్ కోనేరు అందజేశారు. అలాగే తోపుదుర్తి మహిళ సహకార డైరీ, రాప్తాడు నియోజకవర్గ పారిశ్రామికవేత్తలు, నేత‌లు సంయుక్తంగా ఇచ్చిన కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, వేదవ్యాస్, రాజశేఖర్ రెడ్డి, హరిప్రసాద్ చౌదరి కలిసి సీఎం‌ జగన్‌కు అందజేశారు.

అదేవిధంగా పల్సన్ గ్రూప్ రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును పల్సన్ గ్రూప్ సీఈఓ డాక్టర్ శ్రీనుబాబు.. సీఎం జగన్‌కు అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VD: విధి విజయ్ దేవరకొండ ని రాజును చేసిన చిత్రంగా శౌర్యువ్ సినిమా

Suriya: వీరభద్రుడు అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగులో విడుదల

Pooja Hegde,: తేరా హో జావున్ బీచ్ పాటలో పూజా హెగ్డే అందరి దృష్టిని ఆకర్షించింది

Ranabali: రణబాలి నుంచి విజయ్ దేవరకొండ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్

అడివి శేష్ ‘డెకాయిట్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments