అక్కడ పండిన కూరగాయలు వాడొద్దు: నిపుణుల బృందం నివేదిక

Webdunia
సోమవారం, 11 మే 2020 (21:18 IST)
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో స్టైరీన్‌ ప్రభావానికి గురైన వ్యక్తులు ఏడాది పాటు వైద్య పరీక్షలు చేయించుకోవాలని క్షేత్రస్థాయిలో పర్యటించిన నిపుణుల బృందం తన సిఫార్సుల్లో పేర్కొంది.

సమీప ప్రాంతంలో పండిన కూరగాయలు, పండ్లను కూడా వినియోగించొద్దని ప్రజలకు సూచించింది. ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎస్‌ఐఆర్‌- ఎన్‌ఈఈఆర్‌ఐ నిపుణుల బృందం ఓ నివేదిక రూపొందించింది.

సంబంధిత నివేదికను కేంద్రానికి పంపించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఈ బృందం పరిశ్రమ సమీపంలోని రహదారులు, ఇళ్లలో స్టైరీన్‌ అవశేషాలు గుర్తించింది. ఒక నివాసంలో అత్యధికంగా 1.7 పీపీఎం స్టైరీన్‌ను గుర్తించినట్లు తన నివేదికలో ఈ బృందం ప్రస్తావించింది.

నివాసాలు పూర్తిగా శుభ్రపరిచాకే తిరిగి వెళ్లాలని నిపుణుల బృందం సూచించింది. 5 గ్రామాలు, 3 కిలోమీటర్ల పరిధిలో పండిన కూరగాయలు, పండ్లను వినియోగించరాదంది. ఇదే పరిధిలో గ్రాసాన్ని కూడా పశువులకు అందించవద్దని నిపుణుల బృందం సూచించింది.

విషవాయువు ప్రభావం పడిన మొక్కలను జీవీఎంసీ ద్వారా తొలగించాలంది. తదుపరి నివేదిక వచ్చే వరకు స్థానిక పాల ఉత్పత్తులను వినియోగించరాదని సిఫార్సు చేసింది.

తాగు, వంట కోసం బహిరంగ జల వనరులు వాడొద్దని, ప్రభావిత ప్రాంతాలను సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రపరచాలని సూచించింది. ప్రభావిత ప్రాంతాల్లో వాహనాలను సైతం శుభ్రపరిచాకే వాడాలని తన సిఫార్సుల్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments