చంద్రబాబుకు సవాల్, కాణిపాకంలో ఒట్టేసుకుందామా? డిప్యూటీ సిఎం కంటతడి

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:03 IST)
తిరుపతిలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కంటతడిపెట్టారు. తనపై లేనిపోని ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దళితుడు కావడంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని.. చంద్రబాబు అండ్ కో పనిగట్టుకుని విమర్సలు చేస్తున్నట్లు డిప్యూటీ సిఎం చెప్పారు.
 
తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తిరుపతి ప్రెస్ క్లబ్ లోనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు కాణిపాక వరిసిద్ధి వినాయకుని సాక్షిగా ప్రమాణం చేయడానికి కూడా తాను సిద్థమని సవాల్ విసిరారు.
 
చంద్రబాబుకు దమ్ముంటే కాణిపాకంకు రావాలన్నారు. సమితి అధ్యక్షుడి నుంచి ఉపముఖ్యమంత్రి వరకు ఎన్నో హోదాల్లో పనిచేసిన తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు. 
 
అవినీతికి కేరాఫ్ చంద్రబాబని.. చంద్రబాబు కూడా తనపై విమర్సలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. టిడిపి అండ్ కో తనపై ఆరోపణలు మానుకోవాలంటూ ఉద్వేగానికి లోనైన నారాయణస్వామి కంటతడి పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments