Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ నుంచి రెండున్నర గంటల్లో తిరుపతికి...స్పైస్ జెట్ విమాన సర్వీసు

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (10:10 IST)
స్పైస్‌ జెట్ ఢిల్లీ-తిరుపతి మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. సహాయ మంత్రులు జనరల్ వీకే సింగ్, ప్రహ్లాద్ పటేల్, స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్‌ జెండా ఊపి నిన్న విమాన సేవలను ప్రారంభించారు.
 
అనంతరం సింధియా మాట్లాడుతూ, ఢిల్లీ-తిరుపతి మధ్య ప్రస్తుతం బుధవారం, శుక్రవారం, ఆదివారం సర్వీసులు నడుస్తాయని, ఈ నెల 31 తర్వాత వారంలో నాలుగు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మే 2022 నాటికి తిరుపతి రన్‌వే విస్తరణ పనులు పూర్తి చేసి వైట్ బాడీ అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేలా చూస్తామన్నారు.
 
తిరుపతి విమానాశ్రయం ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, బెళగావి, కలబురిగి, కొల్హాపూర్ నుంచి తిరుపతికి నేరుగా విమానాలు నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఇదే తొలిసారి. ఈ రెండు నగరాల మధ్య 2,160 కిలోమీటర్లు కాగా, విమానంలో రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు.  రైల్వే రెండో తరగతి ఏసీ చార్జీల కంటే తక్కువ ధరకే విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments