Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో జిల్లా పి.గన్నవరంలో కంటోన్మెంట్ జోన్లు.. కర్ఫ్యూ

Webdunia
బుధవారం, 21 జులై 2021 (17:38 IST)
ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా పి.గన్నవరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడ కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. అలాగే, కర్ఫ్యూ కూడా అమలు చేయనున్నారు. 
 
కరోనా వైరస్ మహమ్మారి ప్రతి ఒక్కరినీ ఎలా భయభ్రాంతులకు గురిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ ముప్పు ఇంకా తొలగిపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ అతి సమీపంలో ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. ఏపీలో కూడా వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతోంది. 
 
ముఖ్యంగా ఏపీలోని కోనసీమలో మళ్లీ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తీవ్రత పెరగకుండా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 
 
కరోనా మూడో దశలోకి కొనసీమను తీసుకెళ్లకుండా ప్రజలు జాగ్రత్తపడాలని అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి కోరారు. మొదటి, రెండో దశల్లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. మూడో దశలోకి కొనసీమను తీసుకెళ్లకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. 
 
ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మూడవ దశ కోవిడ్ బారిన పడకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
 
ఇంకోవైపు, కోనసీమలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పి.గన్నవరం మండలంలో పలుచోట్ల కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. మండలంలో పాజిటివ్ రేట్ అధికంగా ఉన్న నేపథ్యంలో వారం రోజుల పాటు పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. 
 
ఈ కర్ఫ్యూ బుధవారం నుంచి వారం రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుంది. మిగతా సమయాల్లో కర్ఫ్యూ కొనసాగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments