Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఏమాత్రం తగ్గని పాజిటివ్ కేసుల నమోదు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (17:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదుతో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,280 సాంపిల్స్‌ని పరీక్షించగా 2,527 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 
 
అలాగే కోవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మరణించారు. అలాగే, గడచిన 24 గంటల్లో 2,412 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య…23939 కాగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య…1909613, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య… 1946749, మొత్తం మరణాల సంఖ్య…13197గా ఉంది. 
 
ఇదిలావుంటే, తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కారణంగా నలుగురు మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ పవార్ రాజ్యసభలో మంగళవారం బ్లాక్ ఫంగస్‌పై ఓ సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. 
 
బ్లాక్ ఫంగస్‌తో దేశవ్యాప్తంగా 4,332 మంది మరణించారని తెలిపారు. తెలంగాణలో 2,538 మంది ఈ ఫంగస్ బారినపడగా నలుగురు మాత్రమే చనిపోయినట్టు వివరించారు.
 
ఇక కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి పీఎంజీకేపీ బీమా కింద ఒక్కొక్కరికి రూ.50 లక్షల బీమా చెల్లించినట్టు కేంద్ర సహాయమంత్రి భారతీ పవార్ తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ నుంచి 64 క్లెయిమ్స్ వచ్చాయని, వాటిలో 53 పరిష్కరించామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments