Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యాంగం అందరికీ ఆదర్శం.. అందుకే అమ్మ ఒడి: సీఎస్ సాహ్ని

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (14:37 IST)
అమరావతి : విద్య, వైద్య రంగాలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎస్ నీలం సాహ్ని తెలిపారు. ఇవాళ ఏపీ రాజభవన్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సాహ్ని పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాల ప్రస్తావన తెచ్చారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 
 
అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శమన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రాధమిక హక్కులు ఉండాలని సాహ్ని ఆకాంక్షించారు. 2015నుంచి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు.
 
 
అందుకే అమ్మ ఒడి : ‘బడుగు బలహీన వర్గాలకు మెరుగైన విద్య అందించడం ద్వారా అభివృద్ధి సాధ్యం. తల్లిదండ్రులు తమ‌ పిల్లలను బడికి పంపడం‌ బాధ్యతగా భావించాలి. అందుకే ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా అమ్మలకు‌ చేయూతను ఇస్తోంది. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు’ అని సాహ్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments