Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్ల పుట్టిందని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు..

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (10:50 IST)
ఆడపిల్ల పుట్టిందని.. భర్త ముఖం చాటేశాడు. రెండో పెళ్లి చేసేసుకున్నాడు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా.. పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదిలేక చివరికి కుమార్తెతో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మికుంటకు చెందిన లాస్యకు గజ్జెల శివశంకర్‌తో 2014లో వివాహం జరిగింది. 
 
వివాహం సమయంలో అమ్మాయి తరపు వారు నాలుగు లక్షల కట్నం ఇచ్చుకున్నారు. అయితే పెళ్లయ్యాక, లాస్యకు పాప పుట్టాక శివశంకర్ అసలు స్వరూపం బయటపడింది. అమ్మాయి పుట్టిందని లాస్యను అదనపు కట్నం తెమ్మని వేధించాడు. భర్త శివశంకర్‌తో పాటు అత్తమామలు, ఆడపడుచులు వేధించడం మొదలుపెట్టారు. చివరికి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో  లాస్య పుట్టింటికి వచ్చింది. 
 
అయితే తాను లేని సమయంలో భర్త నాగలక్ష్మి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుని గతేడాది జూన్ 6న జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించినా.. ఎలాంటి ఫలితం లేకపోవడంతో.. చివరికి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళనను విరమించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments