Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంచుకుంటానని తెచ్చి 13 ఏళ్ల బాలికకు వివాహం... నిద్రమాత్రలిచ్చి శోభనం...

గుంటూరు జిల్లాలో ఓ మైనర్ బాలిక పట్ల ఆమె మేనత్త దారుణానికి పాల్పడింది. బాలికను పెంచుకుంటానని చెప్పి తీసుకుని వచ్చి ఆమెను 35 ఏళ్ల యువకునికిచ్చి పెళ్లి చేసింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పాతూరి వెంకయ్య, పార్వతి దంపతుల 13

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (20:57 IST)
గుంటూరు జిల్లాలో ఓ మైనర్ బాలిక పట్ల ఆమె మేనత్త దారుణానికి పాల్పడింది. బాలికను పెంచుకుంటానని చెప్పి తీసుకుని వచ్చి ఆమెను 35 ఏళ్ల యువకునికిచ్చి పెళ్లి చేసింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పాతూరి వెంకయ్య, పార్వతి దంపతుల 13 ఏళ్ల కుమార్తెను పెంచుకుంటానంటూ బాలిక మేనత్త నాగలక్ష్మి తన ఊరికి తీసుకవచ్చింది. 
 
బాలికను పాఠశాలకు కూడా పంపిస్తోంది. ఆమె 5వ తరగతి చదువుకుంటోంది. ఐతే ఏమి ఆలోచన చేసిందో తెలియదు కానీ గత నెల నవంబరు 25న ఆ బాలికను కందుకూరు తీసుకెళ్లింది. అక్కడ మాలకొండ స్వామి దేవాలయంలో 35 ఏళ్ల మనోజ్‌తో గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేయించేసింది. 
 
బాలికకు పెళ్లి చేస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదు. పెళ్లి చేసిన వెంటనే అభంశుభం తెలియని బాలికను శోభనం గదిలోకి పంపింది. పాలలో నిద్రమాత్రలు కలిపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు మనోజ్. తెల్లారిన తర్వాత బాలికకు మెళకువ వచ్చి తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడినా వదలక చిత్రహింసలకు గురిచేసింది. బాలిక తల్లి తన బిడ్డ ఎలా వుందోనని వచ్చిన తర్వాత కానీ అసలు విషయం బయటకు వచ్చింది. జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments