Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎవడు' టైప్‌లో ప్రియురాలు మాస్టర్ ప్లాన్... మటన్ సూప్‌ పట్టిచ్చింది...

నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. ఆపై ప్రియుడిపై యాసిడ్‌పోసి ఆస్పత్రిలో చేర్చిన స్వాతి పోలీసుల అదుపులో వున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌న

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (20:49 IST)
నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. ఆపై ప్రియుడిపై యాసిడ్‌పోసి ఆస్పత్రిలో చేర్చిన స్వాతి పోలీసుల అదుపులో వున్న  సంగతి తెలిసిందే. కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజేష్‌తో సెటిలైపోయేందుకు స్వాతి మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. కానీ స్వాతి ప్లాన్‌ను సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు బట్టబయలు చేశారు. 
 
ఎలాగంటే..? యాసిడ్ దాడి జరిగిన తమ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కోడలికి ధైర్యం చెప్పేందుకు.. ఆస్పత్రిలో సుధాకర్‌ను చూసేందుకు అతడి తల్లిదండ్రులు వచ్చారు. తమ కుమారుడేనని భావిస్తున్న వారికి తొలి అనుమానం మటన్ సూప్ వద్ద వచ్చింది. చికిత్స పొందుతున్న వ్యక్తి రాజేష్ అని సుధాకర్ కాదనే అనుమానం ఆయన తల్లిదండ్రులకు ఎలా వచ్చిందంటే... సాధారణంగా ఆసుపత్రి బెడ్‌పై ఉంటే, వారికి బలవర్ధక ఆహారంగా మటన్ సూప్‌ను ఇస్తారు. ఇదే తరహాలో రాజేష్‌కు ఆస్పత్రి వర్గాలు మటన్ సూప్ ఇచ్చారు. 
 
కానీ దాన్ని రాజేష్ నిరాకరించాడు. సుధాకర్ మాంసాహారి కావడం.. అతనికి మటన్ సూప్ అంటే తెగ ఇష్టం. కానీ రాజేష్ మటన్ సూప్ వద్దనడం.. దాన్ని ముట్టుకోకపోవడంతో అతనిపై వారికి అనుమానం వచ్చింది. ఈ అనుమానంతోనే ఈ కేసు తమ వరకు వచ్చిందని.. సుధాకర్ తల్లిదండ్రులు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుతోనే స్వాతి బండారాన్ని బట్టబయలు చేయగలిగామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments