'ఎవడు' టైప్‌లో ప్రియురాలు మాస్టర్ ప్లాన్... మటన్ సూప్‌ పట్టిచ్చింది...

నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. ఆపై ప్రియుడిపై యాసిడ్‌పోసి ఆస్పత్రిలో చేర్చిన స్వాతి పోలీసుల అదుపులో వున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌న

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (20:49 IST)
నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. ఆపై ప్రియుడిపై యాసిడ్‌పోసి ఆస్పత్రిలో చేర్చిన స్వాతి పోలీసుల అదుపులో వున్న  సంగతి తెలిసిందే. కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజేష్‌తో సెటిలైపోయేందుకు స్వాతి మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. కానీ స్వాతి ప్లాన్‌ను సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు బట్టబయలు చేశారు. 
 
ఎలాగంటే..? యాసిడ్ దాడి జరిగిన తమ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కోడలికి ధైర్యం చెప్పేందుకు.. ఆస్పత్రిలో సుధాకర్‌ను చూసేందుకు అతడి తల్లిదండ్రులు వచ్చారు. తమ కుమారుడేనని భావిస్తున్న వారికి తొలి అనుమానం మటన్ సూప్ వద్ద వచ్చింది. చికిత్స పొందుతున్న వ్యక్తి రాజేష్ అని సుధాకర్ కాదనే అనుమానం ఆయన తల్లిదండ్రులకు ఎలా వచ్చిందంటే... సాధారణంగా ఆసుపత్రి బెడ్‌పై ఉంటే, వారికి బలవర్ధక ఆహారంగా మటన్ సూప్‌ను ఇస్తారు. ఇదే తరహాలో రాజేష్‌కు ఆస్పత్రి వర్గాలు మటన్ సూప్ ఇచ్చారు. 
 
కానీ దాన్ని రాజేష్ నిరాకరించాడు. సుధాకర్ మాంసాహారి కావడం.. అతనికి మటన్ సూప్ అంటే తెగ ఇష్టం. కానీ రాజేష్ మటన్ సూప్ వద్దనడం.. దాన్ని ముట్టుకోకపోవడంతో అతనిపై వారికి అనుమానం వచ్చింది. ఈ అనుమానంతోనే ఈ కేసు తమ వరకు వచ్చిందని.. సుధాకర్ తల్లిదండ్రులు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుతోనే స్వాతి బండారాన్ని బట్టబయలు చేయగలిగామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments