Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైద్యుల వద్దకు అందమైన అమ్మాయిలు: లక్షలు గుంజుకుంటున్న ముఠా

అమరావతిలో వైద్యులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు గుంజే ఓ ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నవ్యాంధ్రలో విజయవాడ, గుంటూరు జిల్లాలో యువ వైద్యులను లక్ష్యంగా చేసుకుని రంగంలోకి అమ్మాయిలను దించి.. భ

వైద్యుల వద్దకు అందమైన అమ్మాయిలు: లక్షలు గుంజుకుంటున్న ముఠా
, గురువారం, 7 డిశెంబరు 2017 (13:19 IST)
అమరావతిలో వైద్యులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు గుంజే ఓ ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నవ్యాంధ్రలో విజయవాడ, గుంటూరు జిల్లాలో యువ వైద్యులను లక్ష్యంగా చేసుకుని రంగంలోకి అమ్మాయిలను దించి.. భారీ మొత్తాన్ని గుంజేసుకునే ముఠా గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువ వైద్యులే లక్ష్యంగా మోసగత్తెలైన అందమైన అమ్మాయిలను వారి వద్దకు వైద్యం కోసం పంపుతారు. ఆ అమ్మాయిలు మాయమాటలు చెప్పి వారిని లోబరుచుకుంటారు. వైద్యుల వద్ద తన భర్త సంసారానికి పనికిరాడని చెప్తూ.. వారికి దగ్గరవుతారు. ఆపై ఇంటికి పిలిపించుకుని రాసలీలలు మొదలెడుతారు. ఈ తతంగాన్నంతా వీడియో తీస్తారు. ఆ వీడియోలను వారికే పంపి బ్లాక్‌మెయిల్ చేసి లక్షలు గుంజుతారు. ఇలా 11 మంది వైద్యులు మోసగత్తెల వలలో చిక్కుకున్నారని పోలీసులు వెల్లడించారు. 
 
30-40 ఏళ్ల వయస్సు మధ్యనున్న వైద్యుల ఆస్పత్రులను ఎంచుకుని ఈ ముఠా పక్కా ప్లాన్ ప్రకారం లక్షలు గుంజుకుంది. అయితే ఇటీవల గుంటూరుకు చెందిన ఓ యువ డయాబెటాలజిస్ట్ నుంచి ఈ ముఠా భారీగా డబ్బు వసూలు చేయడంపై ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఒంగోలు, విజయవాడలో ఈ మోసగత్తెల చేతిలో వైద్యులు మోసపోయారని.. ఇంచుమించు రూ.50 లక్షలకు పైగా సమర్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేస్‌లోకి "పందెం కోడి"... విశాల్ నామినేషన్ పునఃసమీక్షకు ఈసీ ఆదేశం?