Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో కరోనా కలకలం - ఇద్దరు కార్పొరేటర్లకు కరోనా

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (15:11 IST)
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్, విభాగంలో పలువురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తేలింది. 
 
నగరపాలక సంస్థ తొలి కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇద్దరు కార్పొరేటర్లకు కోవిడ్ పాజిటివ్ రావడంతో కౌన్సిల్ సమావేశం నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ముందస్తుగా కార్పొరేటర్లందరికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. రిజల్ట్ తర్వాత కౌన్సిల్ సమావేశం వాయిదా పై అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 35,741 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 5,086 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,42,135 మంది వైరస్‌ బారినపడినట్లు ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments