Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనాతో పోరుకు మేముసైతం అంటున్న పోలీసులు

కరోనాతో పోరుకు మేముసైతం అంటున్న పోలీసులు
, మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (12:24 IST)
గుంటూరు జిల్లా మాచర్ల: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆంధ్ర రాష్ట్ర డీజీపీ, ఎస్పీ గార్ల ఆదేశాలమేరకు మాచర్ల రూరల్ ఎస్ఐ ఉదయలక్ష్మి గారు, పట్టణంలోని రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో మరియు  ప్రయాణం చేసే బస్సులో, జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో, ప్రజలకు కరోనా వైరస్ గురించి మరియు మాస్క్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.

అనంతరం మాచర్ల రూరల్ ఎస్ఐ ఉదయలక్ష్మి గారు మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేలా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించి శానిటైజర్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో తప్ప ఇతర సమయాలలో బయటకు రావద్దని సూచించారు.

అనంతరం బస్సులో మరియు ఆటోలో టిఫిన్ బండ్లు, రెస్టారెంట్ వంటి ప్రదేశాలలో మాస్క్ లేని ప్రజలకు మాస్క్ లు అందించారు. మాస్క్ లేకుండా ఏ ఒక్కరూ బయటకు రావద్దని సూచించారు. కొంత కాలం వరకు మాస్క్ అనేది మన జీవితంలో నిత్య అవసర వస్తువు అని తెలియచేశారు. ఈ సందర్భంగా ఈ ఆపరేషన్ లో రూరల్ పోలిస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టింగర్‌ మిసైల్‌: ఈ అమెరికా ఆయుధం అఫ్గానిస్తాన్‌లో రష్యాను ఎలా దెబ్బకొట్టింది